Saturday, April 20, 2024

ఎన్‌సిపి అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ఎన్‌సిపి జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ రాజీనామాను పార్టీ ప్రత్యేక కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. శరద్ పవార్ తన పదవిలో కొనసాగాలని కమిటీ కోరింది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం నాటకీయంగా శరద్ పవార్ ప్రకటించారు. పార్టీ కొత్త అధ్యక్షుని ఎంపిక కోసం పార్టీ సీనియర్ నాయకులతో ఒక ప్రత్యేక కమిటీని శరద్ పవార్ ఏర్పాటు చేశారు.

Also Read: కూతురిని తల్లి గొడ్డలితో నరికి… బావిలో పడేసింది

కాగా శుక్రవారం నాడిక్కడ సమావేశమైన ప్రత్యేక కమిటీ రెండు తీర్మానాలను ఆమోదించింది. పవార్ ఆజీనామాను తిరస్కరించడం, పార్టీ అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగాలని అర్ధించడం వంటి రెండు తీర్మానాలను ఆమోదించిన కమిటీ దీనిపై తుది నిర్ణయం పవార్‌కే వదిలివేయాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News