Thursday, April 18, 2024

విడిపోయిన ధావన్, ఆయేషా జంట

- Advertisement -
- Advertisement -

Shikhar Dhawan and Ayesha Mukherjee split

తొమ్మిదేళ్ల వివాహ జీవితానికి స్వస్తి చెప్పిన దంపతులు

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ జంట విడిపోయింది. ఈ విషయాన్ని ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిది. దీంతో ఈ జంట ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ‘ రెండోసారి విడాకులు తీసుకునేంతవరకు విడాకులు అనేపదం తనకు చెత్తపదంగా అనిపించేది’ అనిఆయేషా పేర్కొంది. అయితే విడాకుల విషయంలో శిఖర్ ధావన్ ఇంతవరకు స్పందించలేదు. మెల్‌బోర్న్ బాక్సర్ అయిన ఆయేషా ముఖర్జీతో ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012లో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.ఆయేషాకు గతంలో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్‌తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు (జొరావర్) పుట్టాడు. దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ధావన్ జంట తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికింది. ఆయేషా విడాకుల విషయంపై ఇన్‌స్టాలో సుదీర్ఘమైన పోస్టు చేశారు. వివాహం, విడాకులు అనేవి చాలా శక్తివంతమైన అర్థాలు కలిగి ఉంటాయని అన్నారు.

మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డానని, జీవితంలో విఫలమైనట్లు, తప్పు చేస్తున్నట్లుగా భావించానని ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులను, పిల్లలను నిరాశకు గురి చేసినట్లు భావించానని ఆమె తెలిపారు. ఇక రెండోసారి విడాకులు తీసుకోవడం అనేది ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సమయంలో తనను తాను మళ్లీ నిరూపించుకోవాలని ఆయేషా తెలిపింది. కాగా శ్రీలంకతో జరిగిన పరిమిత వన్డే, టి20 సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. త్వరలో జరగబోయే టి20 ప్రపంచకప్‌లో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. టి20 ప్రపంచకప్ జట్టును బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రెండో ఓపెనర్ స్థానం కోసం కెఎల్ రాహుల్‌తో ధావన్ పోటీ పడాల్సి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News