- Advertisement -
సిద్ధిపేట: టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 117 తండాలను పంచాయతీలుగా చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయంలో వెంకటగిరి తండాలో అభివృద్ధి జరిగిందని మంత్రి తెలిపారు. రూ.35లక్షలతో సిసిరోడ్లు, రూ.20లక్షలతో పంచాయతీ భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. శిలాజీనగర్ నుంచి దుబ్బాక వరకు డబుల్ బెడ్ మొయిన్ రోడ్డు నిర్మాణానికి రూ. 8కోట్లు కేటాయించామని హరీశ్ పేర్కొన్నారు. తమ గ్రామాల్లో జరిగిన అభివృద్దిని చూసి దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కే మా మద్దతు అంటూ శిలాజీ నగర్, వెంకటగిరి తండా వాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశామని గ్రామస్తులు తెలిపారు. తీర్మాన పత్రాన్ని మంత్రి హరీశ్ రావుకు అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను మంత్రి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు.
Shivaji nagar Venkatagiri Villages pledge to vote for TRS
- Advertisement -