హైదరాబాద్: శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో సాయి ఆకృత్యాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. పలుమార్లు కుటుంబ సభ్యులు, సాయి కొట్టడంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొడుతున్నారని దేవరాజ్తో శ్రావణి ఫోన్ లో మాట్లాడింది. తన చావుకు సాయి కారణమని చివరిసారిగా శ్రావణి ఆడియోను దేవరాజ్ బయటపెట్టారు. గతంలోనూ దేవరాజ్ను సాయి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలు ఉన్నాయి. విచారణలో సాయి పాత్రపై దేవరాజ్ సంచలన విషయాలు వెల్లడించారు. కృష్ణానగర్లో అమ్మాయిలను సాయి ట్రాప్ చేశాడని దేవరాజ్ ఆరోపణలు చేశాడు. శ్రావణిని సైతం అలాగే ట్రాప్ చేశాడని దేవరాజ్ వెల్లడించారు. దేవరాజ్తో విడిపోవాలంటూ శ్రావణికి సాయి వేధింపులకు గురి చేశాడు. సాయి వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ లోని మధురానగర్ ప్రాంతం తన నివాసంలోని బాత్రూమ్ లో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
సాయి వేధింపులతోనే శ్రావణి ఆత్మహత్య….
- Advertisement -
- Advertisement -
- Advertisement -