Tuesday, March 19, 2024

శ్రేయస్ అయ్యర్ ఔట్… టీమిండియా 176/7

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: గ్రీన్ పార్క్‌లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ నాలుగో రోజు భారత జట్టు 62 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు మీడిల్ ఆర్డర్ త్వరగా ఔట్ కావడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది.  శ్రేయస్ అయ్యర్ (65) ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.  భారత్ బ్యాట్స్‌మెన్లలో రవీచంద్రన్ అశ్విన్(32), ఛటేశ్వరా పుజారా(22), మయాంక్ అగర్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (01), అజింక్య రహానే (04), రవీంద్ర జడేజా(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో వృద్ధిమాన్ సాహా(27), అక్షర పటేల్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 225 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, సౌతీ  చెరో మూడు వికెట్లు పడగొట్టగా అజాజ్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News