Saturday, April 20, 2024

కాన్పూర్ టెస్టులో శ్రేయస్ అయ్యర్ శతకం..

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే శ్రేయస్ అయ్యర్ సెందరీతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక, 258/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అర్థశతకంతో జోష్ లో ఉన్న రవీంద్ర జడేజా(50) ఒక్క పరుగు జతచేయకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సాహా(01) కూడా ఔట్ అయ్యాడు. దీంతో స్వల్ప వ్యవధిలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 95 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(104), రవిచంద్రన్ అశ్విన్(12)లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Shreyas Iyer hit 100 runs against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News