Wednesday, April 24, 2024

చివరి రెండు వన్డేల నుంచి కీలక ఆటగాడు దూరం

- Advertisement -
- Advertisement -

Shreyas Iyer missed other two ODIs in series due to Injury

 

పుణె: ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ కు షాక్‌ తగిలింది. టాప్‌ ఆర్డర్‌లో కీలక ఆటగాడు‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా సిరీస్‌లోని మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో శ్రేయస్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడడంతో మైదానం వీడాడు. వైద్య పరీక్షల కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒకవేళ తన ఎడమ భుజానికి సర్జరీ చేయాల్సి వస్తే రాబోయే ఐపిఎల్‌ సీజన్‌ మొత్తానికి శ్రేయస్‌ దూరమయ్యే అవకాశం ఉందని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వైద్య పరీక్షలు, డాక్టర్ల సూచలను పరిగణనలోకి తీసుకొని శస్త్రచికిత్సపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయ్యర్‌ భుజానికి బలంగా దెబ్బ తగిలిందని స్కానింగ్‌లో తేలింది. దీంతో ఐపిఎల్‌ 2021కు దూరంకానున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అయ్యర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. శ్రేయస్ అయ్యార్ కు గాయం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మెనేజ్‌మెంట్ తీవ్రంగా కలవరపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News