- Advertisement -
శ్రేయస్ అయ్యర్
దుబాయి: ముంబైతో జరిగిన క్వాలిఫయర్1 మ్యాచ్లో ఘోర పరాజయం పాలు కావడం బాధను కలిగించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వాపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా వైఫల్యం చెందామన్నాడు. దీంతో జట్టుకు ఓటమి తప్పలేదన్నాడు. అయితే క్వాలిఫయర్2లో మెరుగైన ఆటను కనబరచడమే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. బ్యాటింగ్, బౌలిగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తే ఫైనల్కు చేరడం అసాధ్యమేమి కాదన్నాడు. ఇక కీలక సమయంలో హార్దిక్ పాండ్య చెలరేగి ఆడడంతో తమ నుంచి మ్యాచ్ చేజారిందన్నాడు. ఒకవేళ స్కోరు 180లోపే ఉంటే తమకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండేవని అయ్యర్ అభిప్రాయపడ్డాడు.
- Advertisement -