Friday, March 29, 2024

మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

SI Constable commit suicide in Guntur

 

అమరావతి: ఓ మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎనిమిది నెలల నుంచి చుండూరులో శ్రావణి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రవీంద్ర ఐదు సంవత్సరాల నుంచి అక్కడే కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. మొదటి నుంచి కానిస్టేబుల్ శ్రావణితో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. అనంతరం ఇద్దరు కారులో వెళ్లి స్థానిక ఆస్పత్రిలో చేరారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారు అపస్మారక స్థితిలో ఉన్నారని, సాధారణ స్థితిలోకి వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని సిఐ రమేష్ బాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News