Saturday, April 20, 2024

ఫిర్యాదు చేయడానికొచ్చిన యువతిపై అత్యాచారం?.. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్..

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు ఐజిపి వినీత్ బ్రిజల్ అరుందల్ పేట్ ఎస్ఐ, కానిస్టేబుల్ లను సస్పెండ్ చేశారు. తనతో పాటు తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ జి బాలకృష్ణ, కానిస్టేబుల్ సిహెచ్ రాముపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రాథమిక విచారణ నివేదిక వచ్చిన తరువాత.. ఐజిపి వారిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన ఓ యువకుడిపై బాధితురాలు అరుందల్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే, ఎస్ఐ బాలకృష్ణ, ఫిర్యాదు నమోదు చేయకుండా.. విచారణ పేరిట తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అత్యాచారానికి పాల్పడ్డాడని, కానిస్టేబుల్ రాము కూడా తన తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇద్దరినీ అరెస్టు చేయాలని సదరు యువతి డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు వారిని సస్పెండ్ చేశారు.

SI, Constable suspended for assaulting woman in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News