Tuesday, April 23, 2024

ప్రేమపెళ్లి…. ఎస్ఐ జాబ్ రాగానే కోర్టులోనే భార్యపై దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు… ఎస్‌ఐ జాబ్ రావడంతో అదనపు కట్నం తీసుకరావాలని భార్యను వేధించాడు. దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కడంతో అక్కడే ఆమెను సదరు ఎస్‌ఐ చితకబాదిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లావణ్య-నాగార్జున యువతి యువకులు ప్రేమించుకున్నారు. దగ్గరి బంధువులు కావడంతో పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల వరకు కట్నం రూపంలో నాగార్జునకు ఇచ్చారు. కొంత కాలానికి నాగార్జునకు ఎస్‌ఐ ఉద్యోగం రావడంతో లావణ్యంను దూరం పెట్టాడు. ప్రతీరోజు 50 లక్షల వరకు కట్నం తీసుకరావాలని వేధించేవాడు. మరో యువతితో నాగార్జున ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న యువతి స్థానిక ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు కోర్టుకెళ్లింది. ఫ్యామిలీ కోర్టులో విచారణకు నాగార్జున హాజరయ్యాడు. అక్కడే ఉన్న లావణ్య, ఆమె తల్లిదండ్రులపై నాగార్జున దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేయాలని జడ్జీ ఆదేశించారు. గతంలో తనని చంపేస్తానని నాగార్జున బెదిరించారని లావణ్య పోలీసుల ఎదుట వాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News