- Advertisement -
పాత కేసు రద్దు కోరుతూ సిఎం పెట్టుకున్న పిటిషన్ కోర్టు తిరస్కృతి
బెంగళూరు : కర్నాటక సిఎం యెడియూరప్ప తనపై ఉన్న పాత అవినీతి కేసు రద్దు కోరుతూ పెట్టుకున్న పిటిషన్ను కర్నాటక హైకోర్టు తిరస్కరించడంతో యెడియూరప్ప తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కర్నాటక అసెంబ్లీ విపక్ష నాయకుడు సిద్ద రామయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధాని మోడీతోపాటు బిజెపి అగ్రనాయకులు ఇందులో జోక్యం చేసుకుని యెడియూరప్పచే రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 2006-07లో భూమి డినోటిఫికేషన్ కేసులో ఆనాడు డిప్యూటీ సిఎంగా ఉన్న యెడియూరప్పపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఈ కేసు విచారణ సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో యెడియూరప్ప సిఎంగా ఉంటే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని సిద్దరామయ్యా పేర్కొన్నారు.
- Advertisement -