Thursday, April 25, 2024

రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట ఎస్ఐ మృతి

- Advertisement -
- Advertisement -

శామీర్ పేట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండల కేంద్రంలోని మజీద్ పూర్ చౌరస్తాలో లారీని బైక్ పై వెళ్తున్న ఎస్ఐ  మొహమ్మద్ బాషా  ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్తున్న మహమ్మద్ బాషా మజీద్ పూర్ చౌరస్తా వద్ద ప్రమాదవశాత్తు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ భాషా సిద్దిపేట కమిషనరేట్ లోని సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న శామీర్ పేట్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News