Wednesday, April 24, 2024

సిద్స్ ఫార్మ్ ఫౌండర్ కు ‘డేర్ టు డ్రీమ్’ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్ధాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి అత్యంత ప్రతిష్టాత్మకమైన యంగ్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (సౌత్‌) అవార్డును టీవీ 9 నెట్‌వర్క్‌ నిర్వహించిన డేర్‌ టు డ్రీమ్‌ అవార్డులు 2022 వేడుక వద్ద గెలుచుకున్నారు. ఎస్‌ఏపీ మరియు టీవీ9లు ఈ సంవత్సరపు అవార్డులను తీర్చిదిద్దాయి.

ఈ అవార్డు అందుకోవడం పట్ల డాక్టర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మక గ్రోత్‌ మ్యాటర్స్‌ ఫోరమ్‌ నుంచి యంగ్‌ లీడర్‌ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. పాల ఉత్పత్తులను నాణ్యంగా అందించడంతో పాటుగా డెయిరీ ఫార్మింగ్‌ను సాంకేతిక ఆధారితంగా చేయాలనే నాకలను అనుసరించాను. ఈ అవార్డులు మాలో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటుగా సరైన మార్గంలో వెళ్తున్నామనే నమ్మకం కలిగిస్తాయి’’ అని అన్నారు.

డేర్‌ టు డ్రీమ్‌ను ఆన్‌లైన్‌ కమ్యూనిటీ గ్రోత్‌ మ్యాటర్స్‌ ఫోరమ్‌ ఏర్పాటుచేసింది. తమ వ్యాపార , పరిశ్రమల విభాగాలలోని వ్యక్తులను కలుసుకునేందుకు వ్యాపార యజమానుల కోసం ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. డేర్‌ టు డ్రీమ్‌ అవార్డును 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోన్న ఎస్‌ఎంఈలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేశారు. ముంబైలోని హోటల్‌ తాజ్‌ల్యాండ్‌ ఎండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి పలువురు విధాన నిర్ణేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News