మన తెలంగాణ/హైదరాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి కార్మికులకు సర్కారు బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు శనివారం ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జెబిసిసిఐ పదవ సమావేశంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.68 వేల 500 బోనస్గా చెల్లించనున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో జీఎం పర్సనల్ ఆర్సి, ఐఆర్, పిఎం ఏ.ఆనందరావు పేర్కొన్నారు. ఇందుకు గాను 2019-20 ఆర్థిక సంవత్సరంలో అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహిస్తున్న వారు 190 మస్టర్లు, సర్ఫేస్లో పని చేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తి చేసిన వారు 190 మంది ఈ బోనస్ పొందేందుకు అర్హులని ఆ సంస్థ పేర్కొంది. ఈ పీఆర్ఎస్ బోనస్ నాన్ ఎగ్జిక్యూ టివ్, పదో వేజ్ బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేశారు.
కార్మికలకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు(పిఎల్ఆర్) స్కీమ్ కింద ఈ బోనస్ ను కార్మికుల ఖాతాలకు బదిలీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలని సూచించారు.
Singareni to give Diwali bonus for Employees