- Advertisement -
ముంబయి: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రస్తుతం లక్నోలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవలే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు కనికా విందు ఇచ్చింది. ఈ విందులో బిజెపి ఎంపి దుష్యంత్, రాజస్థాన్ మాజీ సిఎం వసుంధర రాజన్ తో 300 మంది ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో దుష్యంత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. విందుకు వెళ్లిన తరువాత పార్లమెంట్ సమావేశాలలో దుష్యంత్ పాల్గొన్నారు. కనికా ఇచ్చిన విందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరోగ్య శాఖ వివరాలను సేకరిస్తోంది. ఆమె ఏ ప్రదేశాలలో సంచరించింది, ఎవరెవరితో ఆమె కలిసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆమె లండన్ నుంచి వచ్చిన తరువాత మూడు ఈవెంట్లకు హాజరయినట్టు సమాచారం. భారత దేశంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా 200 మందికి పైగా వైరస్ సోకినట్టు సమాచారం.
Singer Kanika Kapoor tests positive for Coronavirus
- Advertisement -