Friday, March 29, 2024

చెల్లికి పెళ్లి కుదిరింది… సంతోషంతో వస్తుండగా అక్క మృతి

- Advertisement -
- Advertisement -

Two Young Men Died In Road Accident At Hyderabad

వరంగల్: చెల్లికి పెళ్లి కుదిరిందని, మాట ముచ్చట కోసం వరుడు తరపు కుటుంబ సభ్యులు వస్తున్నారని తెలియగానే ఆమె అక్క తన భర్తతో కలిసి తల్లిగారింటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పుకొట గ్రామంలో సిరబోయిన గణేష్ రెండో కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఇటుకాలపల్లిలో ఉన్న మొదటి కూతురు ఉషారాణికి పెళ్లి సంబంధం కుదరడంతో వరుడు కుటుంబ సభ్యులు ఇంటికి వస్తున్నారని, అల్లుడిని తీసుకొని ఇంటికి రావాలని ఆమెకు తండ్రి ఫోన్ లో చెప్పాడు. మంగళవారం ఉదయం తన భర్త రమేష్‌తో కలిసి ద్విచక్రవాహనం పై ఉషా బయలు దేరింది. గీసుకొండ మండలం వంచనగిరి రోడ్డులోని సాయిబాబా గుడి వద్దకు రాగానే బైక్ పైనుంచి ఉషారాణి పడిపోవడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. అల్లుడు అజాగ్రత్తగా అతివేగంతో ద్విచక్రవాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ఉషారాణి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News