Saturday, April 20, 2024

ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో ఆరుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Six civilians injured in terrorist grenade attack

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బండిపొర జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడిలో ఒక మహిళతో సహా ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం 10.20 ప్రాంతంలో సంబల్ బస్టాండ్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపక్కన పడి పేలిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు పౌరులు గాయపడ్డారని వారు చెప్పారు. గాయపడిన వారిని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆసుపత్రిలో చేర్చగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News