Thursday, April 25, 2024

ఉట్నూర్‌లో ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ : జిల్లాలో ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో ఉట్నూర్ మండలం షాంపూర్ గ్రామ శివారులలో జిల్లా ఎస్పిడి ఉదయ్ కుమార్ రెడ్డికి పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్ ఇన్సెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా పొలాలలో పేకాట ఆడుతున్న ఆరుగురు నిందితులను సంఘటన స్థలంలో అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పిడి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుల వద్ద నుండి ఐదు మొబైల్ ఫోన్లు, రూ 43,150 నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. పేకాటరాయుళ్లను సొంకటే శ్రీరామ్, గిరి జ్ఞానేశ్వర్, సూర్య వంశీ రవి, దౌలే లక్ష్మణ్, గుప్త మనోజ్, దుంగే రిజ్వాన్ గా గుర్తించారు. వీరందరూ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు సంబంధించిన వారిని తెలిపారు. ఈ ఆపరేషన్ లో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారని జిల్లా ఎస్పిడి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News