Friday, April 19, 2024

శ్రీలంకలో పడవ మునక ఆరుగురు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

Six students killed in boat capsize in Sri Lanka

కొలంబో: మంగళవారం శ్రీలంకలో పడవ మునిగిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. దుర్ఘటన జరిగిన సమయంలో మొత్తం 35మంది ప్రయాణికులు అందులో ఉన్నారని నావీ అధికారులు తెలిపారు. కొందరు నీళ్లలో ఈదుకుంటూ వొడ్డుకు చేరుకోగా, మరికొందరిని నావీ సిబ్బందితోపాటు పోలీసులు,గ్రామస్థులు కాపాడారని వారు తెలిపారు. వొడ్డుకు చేరిన 20 మందిలో మరో ముగ్గురు విద్యార్థులేనని వారు తెలిపారు. కురించకేని నుంచి కిన్నియా పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులు కిన్నియాలోని పాఠశాలలో చదువుకునేంందుకు పడవలో వెళ్తారని నావీ అధికారులు తెలిపారు. కొందరు తప్పిపోయినట్టుగా భావిస్తున్నారు. వారి కోసం 8 నావీ బృందాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు. శ్రీలంక తూర్పు తీరంలో ఈ దుర్ఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News