- Advertisement -
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం వివాయకపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా… తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుమారుడు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Six year boy death in road accident at bhadradri
- Advertisement -