Tuesday, April 16, 2024

నేడు రేగుంటకు ముఖ్యమంత్రి కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

Slight changes in visit of CM KCR jagtial

జగిత్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పర్యటనలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎంఎల్ఎ బాల్క సుమన్‌ను సిఎం పరామర్శించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా కెసిఆర్ రేగుంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

Slight changes in visit of CM KCR jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News