Friday, April 26, 2024

అమేథిలో ఇంటి నిర్మాణానికి స్మృతి ఇరాని కుమారుడి భూమి పూజ

- Advertisement -
- Advertisement -

Smriti Irani son performs bhoomi pujan for her house

అమేథి(యుపి): కేంద్ర మంత్రి స్మృతి ఇరాని కుమారుడు జోహార్ ఇరాని గురువారం ఇక్కడ తన తల్లి నిర్మించనున్న ఇంటికి భూమి పూజ నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుంచి అమేథీ స్థానాన్ని కైవసం చేసుకున్న స్మృతి ఇరాని స్థానికులను తన కోసం ఢిల్లీకి రాకుండా ఇక్కడే సులభంగా కలుసుకునేందుకు వీలుగా సొంత ఇల్లు నిర్మించుకుంటానని తన ఎన్నికల ప్రచారంలో అమేథీ ప్రజలకు వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటను ఎప్పుడూ నిలబెట్టుకునే కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణాన్ని శ్రీకారం చుట్టారని ఆమె ప్రతినిధి విజయ్ గుప్తా విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న స్మృతి మెవాయ్ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గుప్తా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News