Thursday, March 28, 2024

అమెరికాలో మంచు తుపాన్‌: ఇద్దరు గుంటూరు వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మృతి చెందారు. న్యూజెర్సీలో ఐస్‌లేక్‌లో చిక్కుకుని నారాయణ, హరిత అనే దంపతులు మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పలపర్రు గ్రామ వాసులుగా గుర్తించారు.

దంపతులిద్దరూ కలిసి ఐస్ లేక్ దగ్గర ఫోటోలు దిగుతుండగా ఐస్ కుంగి మంచులో కూరుకుపోయారు. ఆ సమయంలో లేక్ ఒడ్డునే వారి పిల్లలు ఉ ండటంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. హరిత మృతదేహాన్ని లేక్ నుంచి సహాయక సిబ్బంది వెలికితీశారు. నారాయణ మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News