జగిత్యాల: చేతబడి చేశారనే అనుమానంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను హత్య చేసిన సంఘటన జగిత్యాలలోని మల్యాల మండలం బల్వాంతపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాచర్ల పవన్ కుమార్ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ హైదరాబాద్ లోని అల్వాల్ లో నివసిస్తున్నారు. జగిత్యాల చెందిన విజయ్ అనే వ్యక్తి కొండగట్టుకు రెండు కిలో మీటర్ల చిన్న ఇల్లు కట్టుకున్నాడు. వారం రోజుల క్రితం విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో దుర్మరణం చెందాడు. బావమరిది జగన్ చనిపోవడంతో విజయ్ ను పరామర్శించేందుకు పవన్ కుమార్ తన భార్య కృష్ణ వేణితో కలిసి కొండగట్టుకు వచ్చాడు. పవన్ కుమార్ చేతబడి చేయడంతో తన తమ్ముడు చనిపోయాడని విజయ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఇంట్లో పవన్ ను జగన్ భార్య సుమలత బంధించి నిప్పంటించిడంతో ఘటనా స్థలంలోనే పవన్ సజీవదహనమయ్యాడు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమలతతో పాటు ఈ హత్యలో సహకరించిన వారిని అరెస్టు చేశామని డిఎస్ పి వెంకటరమణ వెల్లడించారు.