బాదం పప్పు తింటే ఆరోగ్యమే కాకుండా మోము కూడా నునుపుదేరి, కాంతివంతంగా మారడానికి ఉపయోగపడుతుంది. అదేలాగంటే!
కావలసినవి: బాదం గింజలు ( ముక్కలుగా చేసినవి) 2 టీస్పూన్లు, తేనె1టీస్పూన్, బాదం నూనె2 టీ స్పూన్లు.
ఎలా చేయాలంటే : బాదం గింజలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ను ఓ బౌల్లోకి తీసుకుని, అందులో తేనె, బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
* ఈ ప్యాక్ మాయిశ్చరైజర్గా పని చేస్తుంది. బాదం నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు రాకుండా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇందులోని విటమిన్ఇ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.