Friday, March 29, 2024

అత్తింటి వేధింపులు…. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

Software employee committed suicide

కామారెడ్డి: ఇల్లు కట్టడం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలోని దేవీ విహార్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కార్తీక అలియాస్ శిరీషా(32), హరిప్రసాద్(35)లో పెద్దలు నిర్ణయించడంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో శిరీషా ఇంటి దగ్గర నుంచి పని చేస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. అత్తింటి కుటుంబ సభ్యులు గత కొన్ని రోజుల నుంచి ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణం కోసం పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని అత్త బాలవ్వ, భర్త గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. దీంతో రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News