- Advertisement -
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సోమవారం కెపిహెచ్బిలో ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్లోని భవనం రెండో అంతస్తు పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిడిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ గంగ వెంకట సత్తిరాజుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
Software Engineer Attempt Suicide in Hyderabad
- Advertisement -