హైదరాబాద్: ప్రియురాలు దూరం కావడంతో ఓ భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలోని కెపిహెచ్బి కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందిన రాకేశ్ హైదరాబాద్లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. రాకేష్ కెపిహెచ్బిలోని తులసీ నగర్లో ఓ అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఇంటి యజమానికి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని రూమ్ను అద్దెకు తీసుకున్నాడు. 25 రోజుల క్రితం అతడిని అమ్మాయి వదిలిపెట్టిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. అమ్మాయి లేని జీవితం వ్యర్థం అనుకొని బెడ్ షీట్ సహాయంతో తన రూమ్లో రాకేష్ ఉరేసుకున్నాడు. మంగళవారం రాకేష్ మిత్రుడు అతడి ప్లాట్కు రాగా ఉరేసుకొని కనిపించాడు. వెంటనే రాకేష్ స్నేహితుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. సూసైడ్ లేటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.