Friday, March 29, 2024

ఆగంతకుల దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

- Advertisement -
- Advertisement -

Five corona patients died of oxygen deprivation in Kurnool

హైదరాబాద్: ఆగంతకులు దాడి చేయడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన నగరంలోని మెహిదిపట్నంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… స్థానికం అయోధ్యనగర్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రమేష్‌కుమార్ మెహిదీపట్నంలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఎటిఎంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చాడు. డబ్బులు డ్రా చేసుకుని బయటికి రాగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రమేష్‌పై దాడి చేసి డబ్బులు, రెండు బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. రమేష్‌కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. దీంతో అయోధ్యనగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Software Engineer died in Mehdipatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News