Tuesday, April 23, 2024

లక్నవరం జలాశయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు

- Advertisement -
- Advertisement -

 

Software Engineer drowned at Laknavaram Reservoir

మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో జలాశయంలో శుక్రవారం నాడు ప్రమాదవశాత్తు జారిపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుధాకర్ (22) గల్లంతయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన సుధాకర్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో సరదా గడిపేందుకు శుక్రవారం ఉదయం లక్నవరం చేరుకున్నారు. సాయంత్రం చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో ఉండగా ప్రమాదవశాత్తు కాలుజారి జలాశయంలో పడిపోయాడు. స్నేహితులు గమనించేలోపే సుధాకర్ నీటిలో మునిగిపోయాడు. దీంతో షాక్‌కు గురైన మిత్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News