Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గుడిపల్లి దగ్గర జరిగింది. పట్రపల్లికి చెందిన కాంతప్ప అనే యువకుడు తన తండ్రి సుబ్బప్పను(65) ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కారులో బయలుదేరారు. గుడిపల్లి శివారులోకి రాగానే వీరి కారును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో తండ్రీ, కుమారుడు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News