Thursday, April 25, 2024

అత్తతో వివాహేతర సంబంధం… మామను చంపి…

- Advertisement -
- Advertisement -

అమరావతి:  అత్తతో అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకొని మామను హత్య చేసిన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో రంగయ్య చెరువు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగరాజు-మంజుల అనే దంపతులు ఎస్‌టి కాలనీలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు రాణి ఉంది. రాణిని చిట్టేరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి పెళ్లి చేశారు. మంజూల తన కూతురు ఇంటికి వెళ్లి వస్తూండేది. ఈ క్రమంలో అత్తతో అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన ఇంట్లో, కూతురు ఇంటికి వెళ్లినప్పుడు అల్లుడితో ఏకాంతంగా గడిపేది మంజుల. గత ఆదివారం తన కూతురు ఇంటికి మంజూల వచ్చింది. అదే రోజు సాయంత్రం మామ కూడా రావడంతో వివాహేతర సంబంధానికి మామ అడ్డుగా ఉన్నాడని అల్లుడికి అత్త తెలిపింది. దీంతో ఇద్దరు కలిసి మామను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. మందు తాగుదామని మామను అల్లుడు బయటకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మామకు పీకలదాకా మద్యం తాగించాడు. అనంతరం మామను అల్లుడు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వడ్లవాడి కుంటలో పడేశారు. స్థానికులు సమాచారం మేరకు నీటిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని నాగరాజుదిగా గుర్తించారు. మంజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించాగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే అల్లుడు, అత్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News