Thursday, April 25, 2024

అల్లుడు తాగిన మద్యాన్ని తాగి మామ మృతి

- Advertisement -
- Advertisement -

Murder

 

జయశంకర్ భూపాలపల్లి: అల్లుడు మద్యం బాటిల్ లో పురుగులు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అల్లుడు అంత్యక్రియలకు వచ్చిన మామ అదే బాటిల్ లో ఉన్న మందు తాగి చనిపోయిన సంఘటన జయశంకర్ భూపాల జిల్లా కాటారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మది నాగరాజు అనే యువకుడు పోలు రవి (45) చిన్న కూతురును వివాహం చేసుకున్నాడు. నాగరాజు అప్పులు ఎక్కువ కావడంతో అతడు మద్యంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లుడు అంత్యక్రియల కోసం రవి దంపతులు వచ్చారు. అంత్యక్రియలు జరిగిన తరువాత ఇంటికి వచ్చిన మామాకు అల్లుడి బెడ్ రూమ్ లో మందు సీసా కనిపించడంతో సేవించాడు. అతడు నురుగులు కక్కుతూ కిందపడిపోవడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మామ రవి చికిత్స పొందుతూ చనిపోయాడు. అల్లుడు చావుకొచ్చి మామ చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Son in law Suicide with wine like as Father in law  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News