సహకరించిన భార్య, కుమారులు
పెద్దపల్లి: ఉద్యోగం కోసం ఓ కొడుకు తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, కొత్తూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం పెద్దపల్లి డిసిపి రవీందర్యాదవ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. కొత్తూరు గ్రామానికి చెందిన ముత్యాల నర్సయ్య గోదావరిఖనిలో సింగరేణి పంపు అపరేటర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ విరమణ పొందడానికి సిద్ధంగా ఉన్న నర్సయ్య కొంతకాలంగా తన కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వడం లేదు. నర్సయ్య భార్య తార తన పెద్ద కొడుకు తిరుపతికి సింగరేణి ఉద్యోగం దక్కలంటే భర్తను హతమర్చాలనుకున్నారు.
ఈ క్రమంలో గత నెల 23న పధకం ప్రకారం నర్సయ్య భార్య తార తనకు అనారోగ్యం ఉందని చిన్న కొడుకు రాకేష్తో కలిసి గోదావరిఖనికి వెళ్ళిపోయింది. 25న కొత్తూరులో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న నర్సయ్య మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రిపోయాడు. ఈ సమయంలో పెద్ద కొడుకు ముత్యాల తిరుపతి తండ్రి ఛాతిపై కూర్చొని నోటికి గుడ్డ కట్టి గొంతు నులిమి హత్యచేశాడు. తరువాత గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి శెళ్లాడు.
అయితే నర్సయ్య గుండెపోటుతో చనిపోయి ఉంటాడని బంధువులు భావించారు. నర్సయ్య మృతి చెందిన విషయన్ని ధర్మారం పోలీసులకు తెలియజేశారు. అనుమానం వచ్చిన సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ ప్రేమ్కుమార్ పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. దీంతో నిందితుడు తిరుపతి ఓ పెద్ద మనిషి ద్వారా పోలీస్టేషన్లో లొంగిపోయాడు. నర్సయ్య భార్య తార, కొడుకులు తిరుపతి, రాకేష్లను పోలీసులు ఆరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు.
Son killed his father for job at Peddapalli district