అమరావతి: కోడలిని లైంగికంగా వేధించిన మామను కన్న కుమారుడు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిర్ల తమ్మారావు(55) ఇదరు కుమారులు ఉన్నారు. ఉప్పాడ-పెరుమాళ్లపురం బీచ్ రోడ్డు సమీపంలో తమ్మారావు గేదెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు ఆదినారాయణ ఇంటికి తండ్రి వెళ్లాడు. కోడలు ఒంటరిగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తకు తన తండ్రి గురించి ఆమె చెప్పడంతో వెంటనే ఆదినారాయణ బావి దగ్గరకు వెళ్లి కన్నతండ్రిపై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో తమ్మారావు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆదినారాయణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని స్థానిక సిఐ సూర్య అప్పారావు తెలిపాడు.
Son Murder his Father… he rape attempt son’s wife