Wednesday, April 24, 2024

సిద్దిపేటలో తండ్రిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

Son who killed father in siddipet district

సిద్దిపేట :  కన్న తండ్రినే కొడుకు దారుణంగా హత్య చేసిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం జాలపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి మెతుకు పరమేశ్వర్ రెడ్డి(42)ని అతని కుమారుడు రామాంజనేయరెడ్డి మెడకు వైర్ చుట్టి కిరాతకంగా చంపేశాడు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా కరెంట్ షాక్ తో మరణించినట్టు చిత్రీకరించాడు. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న హుస్నాబాద్ ఎసిపి మహేందర్ విచారణ చేపట్టారు. తరుచూ గొడవ చేస్తున్నాడని తన తండ్రిని తానే హత్య చేసినట్లు కొడుకు అంగీకరించినట్లు ఎసిపి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News