- Advertisement -
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చాడు. మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని సోనూ సూద్ తెలిపాడు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, వారి చిరునామాలు, బ్యాంక్ వివరాలను ఆయన తీసుకున్నాడు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సోనూ సూద్ అండగా నిలవనున్నాడు. అయితే లాక్డౌన్ కాలంలో అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు ఈ బాలీవుడ్ నటుడు చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది.
Sonu Sood offers help to 400 migrants families workers
- Advertisement -