Thursday, April 25, 2024

ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

South Central Railway announcing special trains

 

షిర్డీ- టు సికింద్రాబాద్, షిర్డీ- టు కాకినాడకు స్పెషల్ రైళ్లు
డిసెంబర్ 04వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. గతంలో ప్రకటించిన నవంబర్ 30 వరకే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే వాటిని మరికొంత కాలం పొడిగించింది. వీటితో పాటు మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను నడిపించాలని నిర్ణయించింది. ఇందులో షిర్డీ- టు సికింద్రాబాద్, షిర్డీ- టు కాకినాడ రైళ్లు కూడా ఉన్నాయి. రైలు నెంబర్ 07002 సికింద్రాబాద్ టు -షిర్డీ మధ్య నడుస్తోంది. (డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, ఆదివారం) ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.25 గంటలకు రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సాయినగర్ షిర్డీ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్‌లో ఆగుతుంది.

07001 షిర్డీ- టు సికింద్రాబాద్ మధ్య

రైలు నెంబర్ 07001 షిర్డీ- టు సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. ఈ రైలు (డిసెంబర్ 5 నుంచి ప్రతి శనివారం, సోమవారం) అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.20 గంటలకు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జహీరాబాద్, వికారాబాద్ జంక్షన్, శంకర్‌పల్లి, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్‌లో ఆగుతుంది.

ఇక రైలు నెంబర్ 07206 కాకినాడ టు -షిర్డీ మధ్య రైలు నడుస్తుంది. (డిసెంబర్ 5 నుంచి ప్రతి శనివారం, సోమవారం, బుధవారం) ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటలకు కాకినాడలో రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

07205 షిర్డీ టు -కాకినాడ మధ్య

రైలు నెంబర్ 07205 షిర్డీ టు -కాకినాడ మధ్య రైలు నడుస్తుంది. (డిసెంబర్ 6 నుంచి ఈ రైలు ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం) అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.20 గంటలకు రైలు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. జహీరాబాద్, వికారాబాద్ జంక్షన్, శంకరపల్లి, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్ జంక్షన్, కాజీపేట జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News