Thursday, March 28, 2024

దసరా పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

South Central Railway special trains for Dussehra festival

14వ తేదీ నుంచి ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడలకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్- టు నర్సాపూర్ స్పెషల్ ట్రెయిన్ (07456) ఈ నెల 14వ తేదీ రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరుతుందని అధికారులు తెలిపారు. నర్సాపూర్ టు -సికింద్రాబాద్ స్పెషల్ (07455) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని, సికింద్రాబాద్- టు కాకినాడ టౌన్ స్పెషల్ (07053) ఈ నెల 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుందని, కాకినాడ టౌన్- టు సికింద్రాబాద్ స్పెషల్ (07054) ఈ నెల 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News