చల్లటి కబురు చెప్పి వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకనున్నాయని ప్రకటించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు మామూలుకన్నా నాలుగైదు రోజులు ఆలస్యంగా జూన్ 5 నాటికి కేరళను తాకుతాయని వాతావరణ విభాగం ఇంతకు ముందు అంచనా వేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ నెల 31 జూన్ మధ్య కాలంలో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ఫలితంగా రుతుపవనాలు ముందుగానే అంటే జూన్ 1 లేదా రెండో తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే ఉండాయని ఐఎండి ఇంతకు ముందు అంచనా వేసిన విషయం తెలిసిందే. మరో నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించనుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.
Southwest Monsoon to Kerala on June 1st