- Advertisement -
చెన్నై: కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శుక్రవారం బాలు ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులు పర్యవేక్షణలో బాలుకు చికిత్స జరుగుతుందని ఎంజిఎం వర్గాలు తెలిపాయి. కాగా, ఈనెల 5న కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో బాలసుబ్రహ్మణ్యం చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, నిన్న(గురువారం) రాత్రి నుంచి శ్వాస తీసుకునేం దుకు ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
SP Balasubrahmanyam health condition critical
- Advertisement -