Friday, March 29, 2024

సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్‌ ఆఫీసర్‌ నియామాకం..

- Advertisement -
- Advertisement -

 

సూర్యాపేట: జిల్లాలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్‌ 19) తీవ్రత నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీకి స్పెషల్‌ ఆఫీసర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.సిఎస్ సోమేష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సూర్యాపేటకు ఓఎస్డీని నియమించారు. ప్రస్తుత మున్సిపల్‌ పరిపాలన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డిని ఓఎస్డీగా నియమిస్తూ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఉత్తర్వులు జారీ చేశింది. దీంతో వేణుగోపాల్‌రెడ్డి హుటాహుటిన సూర్యాపేట బయలుదేరారు. గతంలో కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల మున్సిపల్‌ కమిషనర్‌గా జి.వేణుగోపాల్‌రెడ్డి పనిచేశారు. కాగా, సూర్యాపేటలో ఇప్పటివరకు 43 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 శాతం ఢిల్లీలోని మర్కజ్ నుంచి వారే ఎక్కువ ఉన్నారు.

Special Officer Appointment to Suryapet Municipality

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News