తొలి రౌండ్లోనే ఇంటికి
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ పేలవమైన ప్రదర్శన కొత్త సీజన్లోనూ కొనసాగుతోంది. ఈ సీజన్లో మెరుగైన ఆటను కనబరిచి పూర్వ వైభవం సాధించాలని భావిస్తున్న అతనికి నిరాశే మిగిలింది. తాజాగా థాయిలాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో మొదటి రౌండ్లో ఇండోనేషియా ఆటగాడు షెసర్ హిరెన్ చేతిలో ఓటమి చవిచూశాడు. మూడు సెట్ల సమరంలో శ్రీకాంత్ ప్రత్యర్థి చేతిలో కంగుతిన్నాడు. రెండో సీడ్గా బరిలోకి దిగిన శ్రీకాంత్పై షెసర్ సంచలన విజయం సాధించాడు.
ఆసక్తికరంగా సాగిన పోరులో షెసర్ 1221, 2114, 2112 తేడాతో శ్రీకాంత్ను చిత్తు చేశాడు. ఆరంభంలో శ్రీకాంత్ దూకుడును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. తన మార్క్ షాట్లతో అలరించిన శ్రీకాంత్ అలవోకగా గేమ్ను దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రెండు సెట్లలో మాత్రం పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. ప్రత్యర్థి దూకుడు ముందు శ్రీకాంత్ ఎదురు నిలువలేక పోయాడు. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డారు. శ్రీకాంత్ బలహీనతలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన షెసర్ వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.