తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని టాలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రస్తుతం ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కరాణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా పలు ఛానెల్స్ కు రాజమౌళి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమాపై రాజమౌళి స్పష్టత ఇచ్చారు. ”గతంలో పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలనుకున్నాను.. ఆయనను కలిసి సినిమా గురించి చర్చించాను.. కానీ, కుదరలేదు. ఇక ఇప్పుడు చేస్తానని నమ్మకం లేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన రాజకీయాలతో బిజీగా ఉండడం వలన తక్కువ సమయంలో సినిమాలు చేస్తారు. నేనేమో ఏళ్ల తరబడి సినిమాలు చేస్తాను. కాబట్టి పవన్తో సినిమా తీసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్కు సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న భావన 100 శాతం ఉంటే.. నాలో అది కేవలం 0.5 శాతం ఉంటుంది. ఆయన దృక్పథం వేరే.. నా ఆలోచన వేరే” అని రాజమౌళి చెప్పారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల రాజమౌళి ప్రకటించారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
SS Rajamouli Open Up On Movie With Pawan Kalyan