Thursday, April 25, 2024

త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

SSC

 

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21 వరకు జరిగాయి. కరోనా రోజు రోజుకు వ్యాప్తి చెందుతుండడంతో హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 30 వరకు పది పరీక్షలను వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మిగతా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మంగళవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

SSC 2020 Exams Again Postponed in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News