బెంగళూరు: కూతురుపై మారుతండ్రి అత్యాచారం చేసిన సంఘటన కర్నాటకలోని హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రిమా అనే మహిళ మొదటి భర్తతో విడాకులు తీసుకొని అలెగ్జాండర్ను పెళ్లి చేసుకుంది. అలెగ్జాండర్ నిర్మాణ కంపెనీలో సూపర్ వైజర్గ పని చేస్తుండగా యువతి కాలేజీలో చదువుతోంది. మారు తండ్రి, తల్లితో కలిసి జీవిస్తోంది. టీ, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాలలో నిద్ర మాత్రలు కలిపి కూతురుకి తల్లి ఇచ్చేది. నిద్రలోకి జారుకున్న తరువాత కూతురుపై మారు తండ్రి పలుమార్లు అత్యాచారం చేశాడు. సంవత్సరం క్రితం పని నిమిత్తం మారుతండ్రి, తల్లితో కలిసి ఆమె హైదరాబాద్కు వచ్చింది. ఓ హోటల్లో తల్లి, మారుతండ్రి బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటిపై నూలు పోగు లేకపోయేసరకి అనుమాన వచ్చి నిలదీసింది. కడుపులో నొప్పి రావడంతో అత్యాచారానికి పాల్పడ్డారని ఆమెకు అనుమానం వచ్చింది. అమ్మాయి ఎదురుతిరిగేసరికి ఫోన్ లాక్కొని ఇంట్లోనే బంధించారు. మోడలింగ్ చేయాలని, ఆశ్లీల వీడియోలతో పాటు లైంగింక కార్యాకాలపాలకు సహకరించాలని ఆమెను భయబ్రాంతులకు గురి చేశాడు. వాళ్ల వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో హుళిమావు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూతురుపై మారుతండ్రి అత్యాచారం….
- Advertisement -
- Advertisement -
- Advertisement -