- Advertisement -
హైదరాబాద్: లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు, మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షలు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు నమోదు చేశామని ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షలు కేసులు నమోదు చేశామని డిజిపి పేర్కొన్నారు.
- Advertisement -