- Advertisement -
మన తెలంగాణ/రాజన్న సిరిసిల్ల: ఇంటర్మీడియట్ గురుకుల ప్రవేశ పరీక్ష సరిగా రాయలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వీర్నపల్లి మండలంలోని శాంతినగర్ గ్రామ పరిధిలోని బండ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బండ తండాకు చెందిన భూక్య రాములు నాయక్ కూతురు శిరీష(15) ఈ నెల 8న ఇంటర్మీడియట్ గురుకుల ప్రవేశపరీక్ష రాసింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ సరిగా రాయలేదని కలత చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Student attempt suicide in Rajanna Sircilla
- Advertisement -