Friday, April 19, 2024

చదువుల ఒత్తిడి… ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: చదువులో వెనకబడుతున్న అనే మానసిక ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీకి చెందిన జాహ్నవి వేగి అనే విద్యార్థిని కుటుంబం మియాపూర్‌లో నివసిస్తున్నారు. సిబిఎస్‌ఇలో జహ్నవి 12వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు వాకింగ్ కు వెళ్లినప్పుడు ఆమె తొమ్మిదోవ అంతస్థు నుంచి దూకింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స విద్యార్థిని మృతి చెందింది. ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకొని ఉందని ఎస్‌ఐ రవి కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News